నేటి నుంచి మళ్లీ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!

ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) నేడు మళ్లీ ప్రారంభం కానుంది.

తనపై దాడి జరిగిన నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు నిన్న బస్సు యాత్రకు సీఎం జగన్ తాత్కాళిక విరామం ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి ఆయన మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు.కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

ఆత్కూర్, గన్నవరం, వీరవల్లి, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు, పుట్టగుంట మీదుగా నగవరప్పాడుకు యాత్ర చేరుకోనుంది.

నగవరప్పాడులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.తరువాత హనుమాన్ జంక్షన్, బొమ్ములూరు, ఏలూరు క్రాస్, భీమడోలు, గుండుగొలను మీదుగా నారాయణపురం( Narayanapuram ) చేరుకోనున్నారు.

కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కానీ ఈ లోపం ఒకటి సరి చేసుకోవాలి..!