రెండు గంజాయి కేసులలో నలుగురు వ్యక్తులు అరెస్ట్..

రాజన్న సిరిసిల్ల జిల్లా : రెండు గంజాయి కేసులలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిరిసిల్ల టౌన్ సి ఐ కృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ వీరబోయిన ఆజయ్ అనే వ్యక్తి డ్రైవరుగా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడినాడు ఇతనికి గంజాయి తాగే అలవాటు ఉంది.

ఇతడు తన ఫ్రెండ్ వద్ద గంజాయి కొనుక్కొని కొంత తాగి మిగిలినది గంజాయికి అలవాటు పడిన వారికి అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు అజేయ్ ని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయి, 1 సెల్ ఫోన్ స్వాధీనమ్ చేసుకొని వీరబోయిన అజయ్ ని రిమాండ్ కి తరలించడం జరిగింది.

అదేవిదంగా అవునూరి ప్రశాంత్, పండుగ మహేశ్, సందవేణి మహేశ్ లు జల్సాలకు అలవాటుపడి వారు తెలిసిన వ్యక్తి వద్ద గంజాయి కొని తాగుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వారిని పట్టుకొని వారికి గంజాయి కిట్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ రావడం జరిగింది వారి వద్ద నుండి 50 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనమ్ చేసుకొని వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.

ఐ తెలిపారు.

అమ్మమ్మ ఇంటిని హిందీలో ఎక్స్‌ప్లెయిన్‌ చేసిన జపనీస్ వ్యక్తి.. నెటిజన్లు షాక్..?