అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా మాత ఆలయం నుండి శ్రీ మల్లికార్జున దేవాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి హాజరై గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి శ్రీ మల్లికార్జున దేవాలయం వరకు ఎన్ఆర్ఈజీఎస్ నుండి పది లక్షల నిధులతో మెట్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తికాకముందే అన్ని గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య,ఎంపిటిసి దేవేందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ రాజయ్య,సత్యం, కాంగ్రెస్ నాయకులు ఉచ్చిడి బాల్ రేడ్డి, సుధాకర్ రావు, దేవయ్య, కొండం రాజిరెడ్డి, బాల్ రావు, ఎల్లం, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?