Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీకి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో పంజాగుట్ట పోలీసుల (Panjagutta Police) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (Special Intelligence Branch) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రణీత్ రావును కస్టడీ (Custody) లోకి తీసుకునేందుకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతించింది.

దీంతో పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్నారు.ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీయనున్నారు.

ఆ విషయంలో చిరంజీవి రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఏమైందంటే?