సరస్వతీ విగ్రహం సభ వేదిక వద్ద పెట్టాలని సూచించిన మాజీ ఎంపీటీసీ, వార్డు సభ్యులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్ధుల సహకారం తో చదువుల తల్లి సరస్వతి విగ్రహం పెట్టారు.

కాగా ఇట్టి పెద్ద బడిలో ఉన్న సరస్వతీ విగ్రహం( Saraswati Statue ) అక్కడే ఉంచాలని కొందరు,మరి కొందరు మార్చాలని ఆలోచన చేశారు.

పెద్ద బడి నిర్మాణ సమయంలో సరస్వతీ విగ్రహం సభా వేదిక మీద పెట్టాలని పెద్దబడి పనులను పర్యవేక్షిస్తున్న సాకేత్ రావు దృష్టికి మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ),వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తీసుకెళ్లగా నిన్న జరిగిన పెద్ద బడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సరస్వతీ విగ్రహం సభ వేదిక పై పెట్టారు.

దీనికి సహకరించిన సాకేత్ రావు గారికి ధన్యవాదాలు.

స్వీడన్ ట్రైన్‌లో AC లోపం.. ఎన్నారై మహిళకు 50% రిఫండ్..??