ఆసక్తిగా మాజీ ఎంపీ పొంగులేటి పొలిటికల్ జర్నీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది.తాజాగా ఆయన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.పొంగులేటి, షర్మిల భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు పొంగులేటి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నిన్న ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: మహిళను వేధించిన డిప్యూటీ తాసిల్దార్.. చివరకి..?!