మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట

మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పును సమర్థించిన మద్రాస్ హైకోర్టు జయప్రద శిక్షార్హురాలేనని వెల్లడించింది.దాంతో జయప్రద సుప్రీంను ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

అయితే థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా.

జయప్రద నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కార్మికులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ కోసం అన్ని కేజీల బరువు తగ్గిన రామ్.. ఈ హీరో కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!