పోలింగ్ సరళిపై మాజీ మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Telangana Parliament Elections ) ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేటీఆర్( KTR ) భేటీ అయ్యారు.

ఎన్నికల్లో పోలింగ్ సరళిపై ఆయన అభ్యర్థులతో చర్చిస్తున్నారు.అనంతరం ఖమ్మం, నల్గొండ మరియు వరంగల్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.అయితే ఈ స్థానంలో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy ) ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవద్దు.. జో బైడెన్‌కు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి