బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..!

తెలంగాణలో బీజేపీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరీంనగర్ లో బండి సంజయ్( Bandi Sanjay ) ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ లో( Karimnagar ) జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ చర్చకు వస్తారన్న ఆయన బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని స్పష్టం చేశారు.

"""/" / బండి సంజయ్ చేతగాని మనిషి అని విమర్శించారు.బీజేపీ నేతలు దేవుడితో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ ( BJP ) వాళ్లు వచ్చాకనే బొట్టు పెట్టడం నేర్చుకున్నామా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే గుడిలోకి వెళ్లడం మనకు బీజేపీ వాళ్లు నేర్పారా అని ప్రశ్నించారు.

అలాగే ఏమీ చేయని బండి సంజయ్ మనకు ఎంపీగా కావాలా? లేక విద్యావంతుడైన వినోద్ కుమార్( Vinod Kumar ) కావాలా? అనేది ఆలోచించుకోవాలని సూచించారు.

వీడియో: వీడేం బైకర్ రా బాబు.. బస్సును బోల్తా కొట్టించాడు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!