బీజేపీకి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ రాజీనామా..!!

బీజేపీకి షాక్ తగిలింది.మాజీ మంత్రి ఎ.

చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చంద్రశేఖర్ రాజీనామా లేఖ పంపారని తెలుస్తోంది.

అయితే బండి సంజయ్ మార్పు తరువాత పార్టీలో చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈటల రాజేందర్ వంటి నేతలు చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.

మరోవైపు చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపారని సమాచారం.

కాగా ఈనెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నేతల సమక్షంలో హస్తం గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?