హన్మకొండలో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
TeluguStop.com
ఆహార విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Authorities ) కొరడా ఝుళిపించారు.
ఈ మేరకు హన్మకొండలో పలు రెస్టారెంట్ల( Restaurants )పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఇందులో భాగంగా బూజుపట్టిన మాంసంతో పాటు పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు.
కుళ్లిపోయిన చికెన్, హానికరమైన రంగులు, ఇతర రసాయనాలు వాడుతున్నట్లు నిర్ధారించారు.ఈ క్రమంలోనే బూజుపట్టిన ఆహార పదార్థాల శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.
తరువాత నమూనాలను ల్యాబ్ కు పంపారు.ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబో ఫిక్స్ అయినట్లేనా..?