ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ పాదాలు మృదువుగా కోమలంగా మెరుస్తాయి!
TeluguStop.com
చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో చర్మ సమస్యలు( Skin Problems ) ఇబ్బంది పెడుతుంటాయి.
చర్మం మొత్తం డ్రై గా మారిపోతుంది.ఇక పాదాలు ( Feet )గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంటాయి.అటువంటి పాదాలను చాలా మంది ఇష్టపడరు.
ఈ క్రమంలోనే వాటిని రిపేర్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ పాదాలు మృదువుగా, కోమలంగా మరియు అందంగా మెరుస్తాయి.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని మూడు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఐదు నిమిషాల పాటు కలిపితే ఒక మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పాదాలకు అప్లై చేసుకోవాలి.
అలోవెరా,( Aloe Vera ) విటమిన్ ఈ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్( Olive Oil ).
ఈ మూడు న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. """/" /
ఈ మూడింటితో క్రీమ్ తయారు చేసుకుని పాదాలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఈ న్యాచురల్ క్రీమ్ పొడిబారిన మీ పాదాలను మృదువుగా, కోమలంగా మారుస్తుంది.అందంగా మెరిపిస్తుంది.
ఈ క్రీమ్ ను వాడితే డ్రైనెస్ సమస్య ఉండదు.ఇక కొందరు పాదాల పగుళ్లతో చాలా బాధపడుతుంటారు.
ఆ సమస్యకు కూడా ఈ క్రీమ్ ఉపయోగపడుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు పగుళ్లపై ఈ క్రీమ్ ను అప్లై చేసుకుని సాక్స్ ధరించి పడుకోవాలి.
ఇలా నిత్యం కనుక చేస్తే పగుళ్లు పూర్తిగా మాయం అవుతాయి.