పిచ్చికుక్క దాడిలో ఐదు గేద దూడలు, వ్యక్తికి గాయాలు.

ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేశవ పెరుమాండ్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలలో కట్టి వేయబడిన గేదె దూడల పై పిచ్చికుక్క దాడి చేయగా ఈ దాడిలో 5 దూడలు గాయపడ్డాయి.

అలాగే రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కూడా గాయపరిచిన పిచ్చి కుక్క.

వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి ఆ కుక్కను చంపివేయడం జరిగింది.గ్రామాలలో విపరీతంగా పెరుగుతున్న వీధి కుక్కలు భయాందోళనలో గ్రామస్తులు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆ వీధి కుక్కల బెడదను తగ్గించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అదిరిపోయే లుక్ లో మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న ఫోటోషూట్ వీడియో?