ప్రభాస్ సెట్‌లో అగ్నిప్రమాదం.. ?

టాలీవుడ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్రలో రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’.

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ మూవీ కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో భారీ సెట్ వేశారు.

అయితే షూటింగ్ మొదటి రోజునే ఈ సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని తెలుస్తోంది.

ఇకపోతే ఇక్కడ చెలరేగిన మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి.

కానీ ఈ లోపలే సెట్ మొత్తం ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని చిత్ర యూనిట్‌కు చెందిన వారు వెల్లడించారు.

మీ పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు పెరగడం లేదా.. అయితే ఇలా చేయండి!