అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లపై జరిమానా

సూర్యాపేట జిల్లా:మోతె మండల( MotheMandal ) పరిధిలోని మామిల్లగూడెం గ్రామంలో బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నసమాచారంతో రెవిన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి మట్టిని తరలిస్తున్న 6 ట్రాక్టర్లను,2 జేసీబీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

ఈ సందర్భంగా మండల తహశీల్ధార్ ప్రకాష్ రావు( Mandal Tehsildar Prakash Rao ) మాట్లడుతూ మామిళ్ళగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 6ట్రాక్టర్లను 2 జేసీబీలపై జరిమానా విధించడం జరిగిందన్నారు.

అనుమతులు లేకుండా ఎవరు మట్టి తోలకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు… అయోమయంలో బీజేపీ ?