ప్రభుత్వ అప్పులపై ఆర్థికమంత్రి చర్చకు రావాలి.. ఎమ్మెల్యే ఈటల

తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

లేని ఆదాయం చూపించి బడ్జెట్ తయారు చేస్తున్నారన్నారు.కేంద్రాన్ని నిందిస్తూ కేసీఆర్ నీచ స్థితికి దిగజారారని విమర్శించారు.

కేంద్రం వసూలు చేసిన ట్యాక్స్ ను 41 శాతం రాష్ట్రాలకు పంచుతోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని డిమాండ్ చేశారు.అప్పుడే ప్రజలకు అసలు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

కేసీఆర్ మోసాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని వెల్లడించారు.అదేవిధంగా షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కెన్యాలోని గుహ.. అసలేమైంది..?