చాలా ఏళ్ల తర్వాత మహేష్ సాలిడ్ స్వాగ్.. ‘గుంటూరు కారం’తో రికార్డులు బద్ధాలేనా?

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం మహేష్ బాబు( Mahesh Babu ) నటిస్తున్న 28వ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న మాస్ స్ట్రైక్ అంటూ వీడియో రిలీజ్ చేసారు.

అలాగే గుంటూరు కారం( Guntur Kaaram Movie )అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.

మంచి మాస్ మసాలా సినిమాగా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది.ఈ అవైటెడ్ కాంబో నుండి వచ్చిన ఈ గ్లింప్స్ సహా టైటిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ గ్లింప్స్ చూసిన మహేష్ ఫ్యాన్స్ చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ మహేష్ ను చూసాం అని చెబుతున్నారు.

"""/" / సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మహేష్ గుంటూరు కారం గురించే టాక్ నడుస్తుంది.

గతంలో ఎప్పుడో పోకిరి సినిమా సమయంలో మహేష్ బాబు ఇలాంటి మాస్ లుక్ లో కనిపించాడు.

మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో మళ్ళీ అలాంటి మాస్ సాలిడ్ స్వాగ్ చూపిస్తున్నాడు.

ముఖ్యంగా ఈ సినిమా గ్లింప్స్ లో మహేష్ బీడీ కాలుస్తూ నడుస్తూ వచ్చే షాట్ హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి.

"""/" / ఇలా చాలా ఏళ్ల తర్వాత మహేష్ తన స్ట్రాంగ్ జోన్ లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది.

మొత్తానికి ఈసారి త్రివిక్రమ్ మహేష్ తో ప్లాన్ చేసిన మాస్ స్ట్రైక్ చూస్తుంటే నెక్స్ట్ లెవల్లో రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

ప్రీ వెడ్డింగ్ వీడియో: తమ డాన్స్‌ను చూసుకొని తెగ నవ్వేసుకున్న వధూవరులు..!