మోదీతో ఫైనల్ మ్యాచ్..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

సెమీ ఫైనల్స్ లో బీఆర్ఎస్ తో గెలిచామన్న ఆయన మోదీ( Narendra Modi )తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నామని తెలిపారు.

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే బీజేపీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఓట్ల కోసం దేవుడితో రాజకీయం చేస్తున్నారన్నారు.పండుగలు వస్తే బీజేపీ సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు.

రాజకీయ స్వార్థం కోసం బీజేపీ ఇదంతా చేస్తోందన్నారు.ఈ క్రమంలో దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని పేర్కొన్నారు.

బీజేపీ అంటే బ్రిటీస్ జనతా పార్టీ అని కొత్త అర్థం చెప్పారు.ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై నేడు ఢిల్లీలో కీలక సమీక్ష