YCP TDP-Janasena Flexi Disputes : ఏపీలో పలు జిల్లాల్లో ఫెక్సీల వివాదం..!

ఏపీలోని పలు జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ,( YCP ) ప్రతిపక్ష పార్టీలు టీడీపీ - జనసేన( TDP-Janasena ) మధ్య ఫ్లెక్సీ వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే మొత్తం మూడు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ - జనసేన నేతల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

పల్నాడు,( Palnadu ) గుంటూరు( Guntur ) జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీ వివాదాలు చోటు చేసుకున్నాయి.

పల్నాడు జిల్లా నెమలిపురిలో జరిగిన ఫ్లెక్సీ వార్ లో టీడీపీ క్యాడర్ పై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

"""/" / అటు కృష్ణా జిల్లాలోని( Krishna District ) విస్సన్నపేటలోనై వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు( Flexis ) పోటాపోటీగా వెలిశారు.

అదే క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలను చింపివేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే ఏపీ వ్యాప్తంగా వైసీపీ ‘సిద్ధం ’( YCP Siddham ) పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తుండగా అందుకు పోటీగా టీడీపీ - జనసేన పార్టీలు కూడా మేము కూడా సిద్ధం, సం సిద్ధం అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

‘హైడ్రా ‘ పేరుతో రేవంత్ వసూళ్లు .. బండి విమర్శలు