బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
TeluguStop.com

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని బలవన్మరణం తీవ్ర కలకలం సృష్టించింది.


ట్రిపుల్ ఐటీలో పీయూసీ -2 చదువుతున్న విద్యార్థిని బాత్ రూమ్ లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.


వెంటనే గమనించిన తోటి విద్యార్థినీలు, సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.మృతురాలు సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపికగా గుర్తించారు.
అయితే దీపిక బలవన్మరణానికి అనారోగ్య సమస్యలే కారణమని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వెల్లడించింది.
5వ అంతస్తు నుంచి వాషింగ్ మెషీన్ జారవిడిచిన వ్యక్తి.. తర్వాతేమైందో చూస్తే కడుపుబ్బ నవ్వుతారు!