బైక్, స్మార్ట్ ఫోన్ కోసం కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి!

ఈ మధ్య కాలంలో మనుషులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

డబ్బు కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి డబ్బు కోసం మూడు నెలల కూతురిని అమ్మేశాడు.

కూతురిని అమ్మగా వచ్చిన డబ్బుతో బైక్, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు.సమాజంలో ఎంతటి దారుణమైన మనుషులున్నారో ఇలాంటి ఘటనల ద్వారా ప్రపంచానికి తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలోని ఒక వ్యక్తి తాగుడుతో పాటు ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు.

సదరు వ్యక్తి ఉన్నపళంగా వేల రూపాయలు ఖర్చు చేస్తుండటంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ వ్యక్తి మూడు నెలల చిన్నారిని అమ్మి డబ్బు సంపాదించినట్లు అధికారులు తేల్చారు.

విషయం తెలుసుకున్న మహిళా సంక్షేమ శాఖ అధికారులు వెళ్లడంతో వాళ్లు పోలీసుల సహాయంతో చిన్నారిని రక్షించారు.

నిందితుడు లక్ష రూపాయలకు చిన్నారిని సంతానం లేని దంపతులకు విక్రయించాడని తెలిసి అధికారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

నిందితుడు లక్ష రూపాయలలో 50 వేలు ఖర్చు పెట్టి బైక్, 15 వేలు ఖర్చు చేసి ఫోన్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

అధికారులు నిందితుడి భార్యను విచారించగా భర్త బెదిరింపులకు లొంగిపోయి బిడ్డకు అమ్మేందుకు ఒప్పుకున్నానని తెలిపింది.

అధికారులు చిన్నారిని కాపాడి తల్లికి చిన్నారిని అప్పగించారు.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!