నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృత్యువాత

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నకిరేకల్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మృతులను తల్లీకొడుకులుగా గుర్తించారు.

ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Kriti Sanon In Filmfare Photoshoot Romantic Looks Like A Full Meal-ఫుల్ మీల్స్ లా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్