అమరావతి వ్యాప్తంగా రైతుల ఆందోళనలు

అమరావతి వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు నిరసనలకు దిగారు.

ప్రభుత్వం చేస్తున్న సెంటు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని వ్యతిరేకిస్తున్న రైతులు నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పట్టాలు తీసుకుని మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా ఇవాళ వెంకటపాలెంలో సీఎం జగన్ సుమారు 50 వేల మందికి పైగా లబ్దిదారులకు పట్టాలు అందించనున్నారు.

ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు భారీగా మోహరించారు.

విశాఖ సౌత్ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!