కృష్ణా జిల్లాలో కనిపించిన అరుదైన పునుగు పిల్లి..!

కృష్ణా జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది.ఈ పిల్లిని చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకుని దానిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.

ఈ పునుగుపిల్లి చాలా అరుదైన జాతి.అంతరించిపోయే జాతులలో పునుగుపిల్లి కూడా ఉంది.

ఈ పునుగుపిల్లి శేషాచలం, నల్లమల్ల అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి.ఇంత అరుదైన ఈ పిల్లి కృష్ణా జిల్లాలో ప్రత్యక్షమైంది.

తోట్ల వల్లూరు మండలం దేవరపల్లికి చెందిన జొన్నల వెంకటరెడ్డి అనే రైతు పొలం కృష్ణా నది ఒడ్డున ఉండడంతో పంట పొలాలకు నీరు పెట్టేందుకు తోటకి వెళ్ళాడు.

ఆయన మోటార్ దగ్గరకు వెళ్లగానే అక్కడున్న వరులలో ఈ అరుదైన పునుగుపిల్లి కనిపించింది.

అయితే రైతు వెంకటరెడ్డి గ్రామస్థుల సహాయంతో జాగ్రత్తగా ఆ పునుగుపిల్లిని పట్టుకుని ఒక బోనులో బంధించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ పునుగు పిల్లి జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అటవీ అధికారులు తెలియజేశారు.

ఈ పిల్లి ప్రత్యేకతను గురించి కూడా వారు వివరించారు.ఈ పునుగు పిల్లిని ఇంగ్లీష్ లో సివెట్, టాడీ క్యాట్ అని పిలుస్తారు.

ఈ పిల్లి తన శరీరం ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక దాని చర్మం పై ఒక తైలంలా అంటుకుని ఉంటుంది.

ఈ తైలం ఎంతో సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది.సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పునుగు పిల్లి తైలాన్ని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉపయోగిస్తారు.

ఈ పునుగుపిల్లి ని ఒక ఇనుప జల్లెడలో ఉంచి వాటిలో చందనపు కర్రను నిలబెడతారు.

తన శరీరం ద్వారా విడుదలయ్యే చెమట కొద్దిసేపటికి ఆరిపోయి దాని చర్మం పై అంటుకుంటుంది.

అయితే జల్లెడలో ఉంచిన చందనపు కర్రకు దాని చర్మాన్ని తాకడం ద్వారా ఆ తైలం కర్రకు అంటుకుంటుంది.

ఈ విధంగా పునుగుపిల్లి నుంచి తైలాన్ని సేకరిస్తారు.ఈ తైలం కోసం తిరుమల గోశాలలో వీటిని పెంచుతున్నారు.

వీటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలతో కూడిన ఈ తైలాన్ని స్వామివారి అభిషేకం తర్వాత విగ్రహానికి పూస్తారు.

ఉమ్మడి మ్యానిఫెస్టో కి బీజేపీ దూరం అందుకేనా ? అమలు అసాధ్యమేనా ?