ప్రమాదావశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామనికీ చెందిన మొగిలోజు రంగయ్య (70) అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే మృతుడు రంగయ్య తనకు గల వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం నుండి పొలంలో ఏర్పాటు చేసిన సపోర్ట్ వైరుకు తాకడంతో సపోర్ట్ వైరకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తో రంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ పరిశీలించి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతునికి భార్య ముగ్గురు కుమారులు వున్నారు.

అర్హతలు ఉన్నా సాయిపల్లవికి దక్కని అవార్డ్.. మరీ ఇంత అన్యాయమా అంటూ?