నటసింహం బాలయ్య చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఫిదా

సినిమా పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే అద్భుతంగా నటించే సత్తా ఉండి, ప్రేక్షకుల మన్ననలు పొందితే ఇక ఆ నటుడి దశ తిరిగి పోయినట్టే అని చెప్పవచ్చు.

కాని సినిమా పరిశ్రమలో చాలా మంది సీనియర్స్ చెప్పే మాట సినిమా పరిశ్రమలో స్నేహాలు అనేవి ఉండవు.

హిట్ లు ఉంటేనే పలకరిస్తారు.లేకుంటే చూసి చూడనట్లు ప్రవర్తిస్తారు.

స్టేజీ మీద మాట్లాడినట్టు బయట ఉండరు.సినిమాలో నటిస్తారు.

బయట కూడా నటిస్తారు.ఇలాంటి మాటలు చాలా మంది హీరోల గురించి వినిపించాయి.

కాని ఒక్క నటసింహం బాలకృష్ణ విషయంలో మాత్రం ఇలాంటి మాటలు వినిపించవు.వినిపించలేదు.

ఎందుకంటే ఏ మాత్రం దాపరికం లేకుండా మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడతాడు.మాట కరుకుగా ఉన్నా బాలకృష్ణ మనసు చాలా గొప్పది అంటుంటారు బాలకృష్ణ సన్నిహితులు.

తనను ఇంతటి స్థాయిలో నిలబెట్టిన అభిమానులను బాలకృష్ణ అక్కున పెట్టుకొని చూసుకుంటాడు.ఎంతలా అంటే అభిమాని కుటుంబంలో ఎవరైనా చనిపోతే స్వయంగా ఫోన్ చేసి పరామర్శిస్తారు.

ఇంకాస్త ముందుకెళ్లి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ జీవితాలను నిలబెడతాడు.ఇలాంటివి కోకొల్లలు గా ఉంటాయి.

తాజాగా బాలకృష్ణ చేసిన ఓ పని ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.తాజాగా బాలయ్య వీరాభిమాని భల్లారీ బాలయ్య అనారోగ్యంతో మరణించారు.

తాజాగా వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు ప్రాధాన్యత తగ్గిందనే ప్రశ్న.. జక్కన్న రియాక్షన్ ఇదే!