పవన్ రీఎంట్రీపై ఫ్యాన్స్ అసంతృప్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు.అజ్ఞాతవాసి సినిమా తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు.

అప్పటి నుండి నేటి వరకు పవన్ మళ్లీ సినిమాల్లోకి రావాలంటూ చాలా మంది ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు.

గతకొంత కాలంగా పవన్ రీఎంట్రీ సినిమాపై తీవ్రంగా చర్చ సాగుతోంది.కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్.

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాతో పవన్ రీఎంట్రీపై కొందరు అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో ఎలివేషన్‌కు అస్సలు స్కోప్ లేదని, కేవలం కాన్సెప్ట్ మీద ఆధారపడి తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ను ఎలివేట్ చేయడం కష్టం అని వారు అభిప్రాయ పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాస్ అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్‌ తారాస్థాయిలో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.

మరి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంలో వారి కోరిక తీరుస్తాడా లేడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తోండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

లీడ్ హీరోయిన్‌గా నివేధా థామస్ నటిస్తోంది.

నిజ్జర్ హత్య కేసు : భారత్‌పై మరోసారి ఆరోపణలు చేసిన ఇండో కెనడియన్ నేత జగ్మీత్ సింగ్