'ఆర్ఆర్ఆర్' : ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట.. ఏంటి జక్కన్న ఇలా చేసావ్?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫ్యాన్స్ సంబర పడ్డారు.

కానీ ఈ సినిమా మళ్ళీ వాయిదా పడడంతో నిరాశ వ్యక్తం చేసారు అభిమానులు.

అయితే ఎట్టకేలకు మళ్ళీ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్ళీ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు.

ఈసారి కరోనా కూడా తగ్గడంతో రావడం పక్కా అంటున్నారు మేకర్స్.ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్న జక్కన్న కొన్నిటిని మర్చిపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు.తాజాగా ట్విట్టర్ ఈమోజీ ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

"""/"/ మరి ఈ క్రమంలోనే రామ్, భీం ఈమోజీని రాజమౌళి పట్టించుకోవడం లేదని స్టార్ హీరోల ఫ్యాన్స్ హార్ట్ అయ్యారట.

ఈ విషయంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఫ్యాన్స్ ఇప్పుడు రామ్, భీం ఈమోజీని కోరుకుంటున్నారు.

ఈ మధ్య సినిమాలకు ఇలాంటి ఎమోజీలు కాస్త ఉత్సాహాన్ని తీసుకు వస్తున్నాయి.అందుకే ఈ విషయంలో అటు తారక్ చరణ్ కూడా కేర్ తీసుకుని ఎమోజీలను రిలీజ్ చెయ్యాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

మరి రాజమౌళి వీరి కోరికను పట్టించుకుంటారో లేదో చూడాలి.అలిగిన ఫ్యాన్స్ ను తృప్తి పరిచేందుకు రాజమౌళి శ్రద్ధ తీసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

లోనవాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు కుటుంబ సభ్యులు.. షాకింగ్ వీడియో వైరల్..?