నెల్లూరు జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్న కలకలం..!

నెల్లూరు జిల్లా కావలిలో తీవ్ర కలకలం చెలరేగింది.తుఫాన్ నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి యత్నించారు.

బిర్యానీలో విష గుళికలు కలిపి తిన్న భాస్కర్ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేశారు.

అయితే అప్పుల బాధ తాళలేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి భాస్కర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

గమనించిన ఇతర కుటుంబ సభ్యులు బాధితులను హుటాహుటిన సమీపంలోని కావలి ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.మెరుగైన చికిత్స కోసం చిన్నారులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.

అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవద్దు.. జో బైడెన్‌కు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి