అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని..: కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ మోదీపై ధ్వజమెత్తారు.

కేంద్రం ఏజెన్సీల బూచి చూపి హెచ్చరిస్తే భయపడే వాళ్లం కాదని చెప్పారు.తెలంగాణ తమ కుటుంబం అన్న కేటీఆర్ రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యులని తెలిపారు.

ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ తమదని పేర్కొన్నారు.అసత్యాలు చెప్పడం ఉత్త చేతులతో వెళ్లడం మోదీకి అలవాటేనని తెలిపారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని చెప్పారు.

గుజరాత్ కు రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారన్నారు.

రూ.520 కోట్ల రైల్వేవ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం అవమానించడమేనని వెల్లడించారు.

బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా మోదీ మాట్లాడలేదని మండిపడ్డారు.దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ అని ఎద్దేవా చేశారు.

యూనివర్సిటీల బిల్లును అడ్డుకుంటున్న గవర్నర్ కు ప్రధాని మోదీ ఒక మాట చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు.

రాజమౌళి వేరే వాళ్ళ కథలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట…