పెళ్ళిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిలో మామగారు అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది.

ఇలా పెళ్ళిలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి.ప్రతి ఆచారం వెనక ఎదో ఒక పరమార్ధం ఉంది.

పెళ్లి పనులు మొదలు పెట్టటానికి ముందు ఎటువంటి విఘ్నలు రాకుండా వినాయకునికి బియ్యం మూట కట్టి ఆ తర్వాత పనులను మొదలు పెడతారు.

అలాగే పెళ్ళిలో ఆడపడుచుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది.పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి దూరం కాలేదన్న భావన కలిగించటానికి ఈ ఆచారం పెట్టారు.

ఇక పెళ్ళిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసుకుందాం.

ఓ పెండ్లి కుమారుడా పంచ భూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతురుని ధర్మ, అర్ధ, కామ, మోక్షలకై నీకు అర్పిస్తున్నాను.

దానం ఇస్తున్నాను.ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను.

ఓ పెండ్లి కుమారుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే.నా బిడ్డ లక్ష్మి దేవి.

అంతటా నీకు కాళ్ళు కడుగుతున్నానని చెప్పి వరుడి కాళ్ళు కడుగుతాడు వధువు తండ్రి.

వారిని లక్ష్మి నారాయణులుగా భావించి పెళ్ళికి వచ్చిన వారందరు వారి మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారు.

సీఎంపై రాయిదాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై రేపు ఆర్డర్