రాయలసీమలో పడగ విప్పుతున్న ఫ్యాక్షనిజం.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దారుణ హత్య.. ?
TeluguStop.com
గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో మళ్లీ ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంటుందట.
ఒకప్పుడు రాయలసీమలో రక్తపాతం ఏరులా ప్రవహించేది.ఇక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటు బ్రతికే వారు.
అలాంటి భయంకర స్దితి నుండి బయటపడింది సీమ అనుకుంటున్న సమయంలో మళ్లీ పాతకక్షలు తవ్వుకుంటూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మనుషుల వేటను మొదలు పెట్టారట.
కాగా ఇటీవలే కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు దారుణ హత్య చేయబడగా, తాజాగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు హత్యకు గురి కావడం గమనార్హం.
ఇక ఈ హత్యలతో తాడిపత్రి, శింగనమల నియోజక వర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మళ్లీ పడగలు విప్పుతున్న ఫ్యాక్షనిజం వల్ల, రాజకీయ కక్షలు తోడేళ్లుగా మారి మానవ సంహారాలను చేస్తుంటే సీమ నేల రక్తంతో తడిసి పోతుందనే భయం ఆందోళన కలిగిస్తుందట.
అరె బాబు.. ఆది బొమ్మ కాదురయ్యా.. జాగ్రత్త!