'ఎఫ్ 3' ఓటిటి కోసం భారీ డీలింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా 'ఎఫ్ 3'.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.

ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.

అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా తీసుకు వచ్చాడు.

ఈ సినిమా అందరి అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అలాగే తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

"""/" / థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అలరించడానికి సిద్ధం అయ్యింది.

ఈ సినిమాను ఓటిటిలో చూసేందుకు థియేటర్ లో సినిమా చూడని ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాను 8 వారాల తర్వాత ఓటిటి లోకి తీసుకు రావాలని దిల్ రాజు టీమ్ భావించింది.

దీంతో ఆలస్యంగా స్ట్రీమింగ్ కు తీసుకు వస్తామని తెలిపారు.అయితే ఇప్పుడు ఈ సినిమా కొద్దిగా ముందే స్ట్రీమింగ్ కి రాబోతుంది.

సోనీ లైవ్ లో తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఇంత ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావడానికి గాను 13 కోట్లు చెల్లించినట్టు టాక్ బయటకు వస్తుంది.

మరి ఈ డీల్ చూస్తుంటే ఎఫ్ 3 సినిమా సాలిడ్ డీల్ అందుకున్నట్టే అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా జులై 22 నుండి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరి ఓటిటి లో ఎంత రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్న చంద్రబాబు..!!