కామెడీ ఆటంబాంబు ఎఫ్3.. ఎవరి పారితోషికం ఎంతో తెలుసా?
TeluguStop.com
కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన నవ్వుల ఆటం బాంబు లాంటి సినిమా ఎఫ్ 2.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలూగా వచ్చిన ఈ సినిమాలో ఇద్దరు హీరోల సరసన తమన్నా, మెహరీన్ నటించారు.
ఇక భార్యాభర్తల మధ్య ఉండే ఫ్రస్టేషన్ ను కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు.
దీంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ప్రేక్షకులకు నచ్చితే ఊరుకుంటారా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.
ఇక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత చిత్రబృందం ఊరుకుంటారా సీక్వెల్ అంటూ తెరమీదికి వచ్చేశారు.
ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సీక్వల్ ప్రస్తుతం తెరకెక్కింది.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలోని పాత్రలు పాతవే అయినా కథ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పి మరింత ఆసక్తిని పెంచాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈక్రమంలోనే ఎఫ్ 3 సినిమా కోసం ప్రస్తుతం నటీనటులు పారితోషికం ఎంత తీసుకున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.
"""/"/
ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో ఇక చివరికి అందరూ పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సీనియర్ హీరో వెంకటేష్ 15 కోట్లు చార్జ్ చేసాడట.ఇక ఎఫ్ 3 లో ఉన్నది ఉన్న కుర్రాడుగా కనిపించిన వరుణ్ తేజ్ 13 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న సీనియర్ బ్యూటీ తమన్నాకు 1.8 కోట్లు ముట్టినట్లు తెలుస్తుంది.
ఇక మరోవైపు యువ హీరోయిన్ మెహరీన్ కి 80 లక్షలు పారితోషికంగా ఇచ్చారట.
ఈ అందరు నటీనటులు అటు ఎఫ్ 2 సినిమాలో మాత్రం ఇంకా తక్కువ పారితోషికం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.
భర్తతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క.. ఆ నాయకుడికి పోటీగా?