ఏపీలో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల..!!

ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ( Exit Polls)విడుదల కానున్నాయి.

ఈ మేరకు రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి.ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో ఎవరికీ వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా జూన్ 9న జగనే ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో సంబరాలకు సైతం వైసీపీ ( YCP )సిద్ధమైంది.మరోవైపు ఈసారి కూటమిదే అధికారమని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.

సర్వే ఫలితాలు సైతం అదే నిర్ధారించాయని కూటమి నేతలు వెల్లడిస్తున్నారు.అంతేకాదు వన్ సైడ్ విక్టరీ ఉంటుందంటూ నేతలకు చంద్రబాబు( Chandrababu ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆసక్తి ఏర్పడింది.