ఎల్లమ్మ సిద్ధియోగం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆదిశ్రీనివాస్..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విలీన గ్రామమైన తిప్పాపురం శ్రీ రేణుక మాత ఎల్లమ్మ సిద్ధియోగం కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ అమ్మవారి దయతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వారు అమ్మవారిని వేడుకున్నారు.

పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు ఉండాలని వారు ఆకాంక్షించారు.

వారి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాగుల విష్ణు ప్రసాద్, నాగుల మహేష్ గౌడ్, ఎర్రం ఆగయ్య,గౌడ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

హాలీవుడ్ టెక్నాలజీతో రాజమౌళి సక్సెస్ సాధిస్తారా..?