ప‌వ‌న్ కల్యాణ్ పై మాజీమంత్రి వెల్లంప‌ల్లి ఫైర్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంప‌ల్లి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

వైసీపీ నేత‌ల‌తో పెట్టుకుంటే ఆయ‌న ఏపీలో తిర‌గ‌లేర‌న్నారు.అదేవిధంగా జ‌నసేన పార్టీ శ్రేణులు దుర్మార్గ‌పు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌ని చెప్పారు.

రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ చేసే అభివృద్ధిని చూడ‌లేక‌నే.అల‌జ‌డులు సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

జ‌న‌సేనాని ఈ సారి 20 చోట్ల పోటీ చేసినా క‌నీసం డిపాజిట్లు కూడా రావ‌ని ఎద్దేవా చేశారు.

ప‌వ‌న్, చంద్ర‌బాబు పార్టీలు మాత్ర‌మే వేర‌న్న ఆయ‌న‌.ఇద్ద‌రి ఎజెండా ఒక‌టేన‌ని ఆరోపించారు.