పోలీసులపై మాజీ మంత్రి జూపల్లి ఫైర్

నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులపై మాజీ మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తున్న ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు పద్ధతి మార్చుకోవాలని,.లేకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతానంటూ హెచ్చరించారు.

తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్ లో పడవ ప్రమాదం.. నలుగురు మృతి