గన్ మెన్లను సరెండర్ చేసిన మాజీమంత్రి బాలినేని..!

గన్ మెన్లను సరెండర్ చేస్తూ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు.

ఒంగోలు నకిలీ దస్తావేజుల కుంభకోణంలో పోలీసుల తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.

నకిలీ దస్తావేజుల స్కాంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలీసులు తన మాటను పెడచెవిన పెట్టారన్న బాలినేని అసలు దోషులను వదిలేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే గన్ మెన్ లను తక్షణం సరెండర్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

కాగా కుంభకోణం కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ భూములను కబ్జా చేస్తున్న ముఠాను గుట్టు రట్టు కాగా ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డీల్ చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం