కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలి: ఎంపీపీ పడిగెల మానస రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇంద్రానగర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టిందని,కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలతో పాటు కంటి అద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ గా రాష్ట్రం మారుతుందన్న నేతలు.కంటి పరీక్షలు చేసుకున్న పలువురికి కంటి అద్దాలను అందజేసిన ప్రజా ప్రతినిధులు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు,ఎంపీటీసీ గుగ్గిళ్ళ లావణ్య ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, కంటి వెలుగు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్ల వివాదం… అడ్డంగా బుక్ అయిన మెగా హీరో…మామూలు ట్రోల్ కాదుగా!