కమళం కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్న ఈటల.. ఎప్పుడంటే.. ?
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన ఈటల రాజేందర్ వ్యవహారాం మొత్తానికి ఒక కొలిక్కి వచ్చిందని ప్రచారం జరుగుతుంది.
ఊహించని పరిణామాల మధ్య టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారా అనే ఆసక్తి తెలంగాణ ప్రజలతో పాటుగా, రాజకీయ నేతల్లో నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడానికి కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదట.
ఈ క్రమంలో తెలంగాణాలో గులాభి సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఆయనకు బలం కావాలి అందుకే కమళం వైపు చూపు సారించిన ఈటల బీజేపీ అండదండలతో తన పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట.
ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.
కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారట.
ఓరి బాబోయ్.. ఫేస్బుక్లో రూ.34 వేలకే ఒకటవ ప్రపంచ యుద్ధం నాటి ఓడ కొనేశాడు..