ఊహించని రీతిలో ఆ మ్యాచ్ ను గెలిచారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి.అన్ని రంగాలు మూతబడ్డాయి.

వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ చేసి కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులో రావడంతో దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నాయి.

సడలింపులు ఇవ్వడంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇక క్రికెటర్లు గ్రౌండ్లలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

ఇంగ్లాండ్ లో టెస్టు మ్యాచులు కూడా ప్రారంభమయ్యాయి.ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు రెండు మ్యాచులు జరిగాయి.

వాటిల్లో చెరొకటి సొంతం చేసుకున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న చివరి మ్యాచ్ ను వరణుడు మొత్తం మార్చేశాడు.

మొదటి మూడు రోజుల్లో తన రెండు ఇన్నింగ్స్ లను పూర్తి చేసిన ఇంగ్లాండ్ 399 పరుగులు తీసింది.

ఇక కరేబియన్ జట్టు ప్రస్తుతం 10 పరుగులు చేసి 2 వికెట్లు కొల్పోయింది.

నాలుగో రోజు కూడా వెస్టిండీస్ పరాజయం తప్పని సరి అనుకున్న సమయంలో ఆట చివరి క్షణాన వర్షం కురిసింది.

ఇంతకు ముందురోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు.కానీ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటతో ఆ మ్యాచ్ ను గెలిచి సత్తా చాటారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.

వర్షం పడక ముందు వెస్టిండీస్ కు చెందిన క్రికెటర్స్ క్రైగ్ బ్రాత్ వైట్ (2), షాయ్ హోప్(4) స్కోరులు చేశారు.

ఈ రోజు మొత్తంగా ఇంగ్లాండ్ బౌలర్లు, వెస్టిండీస్ జట్టును చిత్తు చేస్తారో లేదో వేచి చూడాలి.

వాతావరణ పరిస్థితిని బట్టి మ్యాచ్ లో మార్పులు జరగవచ్చని జట్టు యాజమాన్యం పేర్కొంటున్నారు.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన విదేశీ మహిళ..??