చెన్నైకి చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు..!!

టీమిండియా మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయం సాధించి వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం దక్కించుకుంది.

ఇలాంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడటానికి షెడ్యూల్ ఖరారైంది.

వచ్చే నెల 5వ తారీఖు నుంచి చెన్నై లో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

"""/"/ ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది.

విమానాశ్రయంలో ఇంగ్లాండ్ జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.మరోపక్క భారత్ ఆటగాళ్లు కూడా కొద్ది రోజుల్లో చెన్నైకి చేరబోతున్నారు.

రెండు జట్ల కు చెందిన సభ్యులు ఆరు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ప్రారంభం కానున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో రెండు జట్లు తలపడనున్నాయి.

ఇటీవల రెండు జట్లు బలంగా రాణిస్తున్న నేపథ్యం లో జరగబోయే మ్యాచులు.ఉత్కంఠగా మారాయి.

మరోపక్క బీసీసీఐ ఈ మ్యాచ్ లనూ చూడటానికి ప్రేక్షకులను గ్రౌండ్ లో రాణించటానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది.

కేవలం 50 శాతం మంది మాత్రమే మ్యాచ్ చూసే విధంగా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024