ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వారం రోజులపాటు విదేశీ ప్రయాణం చేసి వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపి మండల సమస్యలను వివరించారు.

ప్రభుత్వ విప్ ను కలిసిన వారిలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, యువజన మండల అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్ ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సూడిద రాజేందర్, సీనియర్ నాయకులు బుచ్చ గౌడ్, గుండాటి రామ్ రెడ్డి, ఇమామ్, చెట్టి పెళ్లి బాలయ్య , గుర్రపు రాములు తదితరులు ఉన్నారు.

హైవే మీద పిచ్చిగా గెంతులు వేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..?