గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ విధించి జైలుకు పంపించిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో వెలుగు చూసింది.

ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్ 19 గంజాయి విక్రయిస్తుండగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిందితుని వద్ద నుండి 130 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకున్నామని పేర్కొన్నారు.

నిందితుడు సమీర్ హైదరాబాదులో విద్యను అభ్యసిస్తుండని అక్కడే గంజాయిని సేవించడం అలవాటు నేర్చుకొని గుర్తుతెలియని వ్యక్తుల నుండి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్న యువకులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

మండల తాసిల్దారు కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని తాసిల్దార్ పంజుల సమక్షంలో పంచనామా చేయడం జరిగిందని అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి కి అప్పగించగా విచారణ అనంతరం జ్యూడిషల్ రిమాండ్ విధించి కరీంనగర్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

మండలంలో ఎవరైనా గంజాయి అమ్మిన సేవించిన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 24, శనివారం 2024