చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల హల్‎చల్

చిత్తూరు జిల్లాలో గజరాజులు హల్‎చల్ చేశాయి.రామకుప్పం మండలంలో పంట పొలాలను ధ్వంసం చేశాయి.

ఏనుగులు చేసిన దాడిలో వరి, అరటి, టమోటా, బీన్స్ పంటలు నాశనం అయ్యాయి.

దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.అదేవిధంగా ఏనుగుల గుంపు సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తాయోననే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.ఫారెస్ట్ అధికారులు స్పందించి, వాటిని అడవిలోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

షాకింగ్ వీడియో: భోజనం వడ్డిస్తుండగా కూరలో ప్రత్యక్షమైన పాము.. చివరకు..