తెలంగాణకు నిలిచిపోనున్న విద్యుత్ క్రయవిక్రయాలు
TeluguStop.com
తెలంగాణకు ఈ అర్ధరాత్రి నుంచి విద్యుత్ క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి.డిమాండ్ను బట్టి రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఎక్స్చేంజ్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి.
అయితే, తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో టీఎస్ విద్యుత్ అధికారుల సంప్రదింపులు జరుపుతున్నారు.
తెలంగాణలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్..!