క్లాస్ రూమ్ లో అడ్డంగా బుక్ అయిన 8వ తరగతి స్టూడెంట్స్..!!

ప్రస్తుత రోజుల్లో సమాజంలో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.టెక్నాలజీ రావటంతో పాటు సెల్ ఫోన్ వచ్చాక.

చిన్నతనంలోనే విద్యార్థులకు అన్ని తెలిసి పోతున్నాయి.ఇతరుల ముందు తెలియని హీరోయిజం చూపించడానికి.

అదే రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి.అడ్డదిడ్డమైన దారులు.

వెతుక్కుంటూ చెడు అలవాట్లకు లోనై తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఒక్క చిన్న పిల్లలు మాత్రమే కాదు వయసుతో సంబంధం లేకుండా చాలామంది వింత వింత చేష్టలు చేస్తున్నారు.

ఇక ఇదే రీతిలో కూడా దైనందిన జీవితంలో వ్యవహరిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు.

మద్యం తాగి తరగతి గదిలోనే డ్యాన్స్ లు వేయడం జరిగింది.దీంతో ఉపాధ్యాయులు వారు మద్యం మత్తులో ఉన్నారని గుర్తించి వెంటనే హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులను స్కూలుకి తీసుకురావటం జరిగింది.వారి సమక్షంలోనే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించి విద్యాకమిటీ తల్లిదండ్రులతో చర్చించి వాళ్లకు టి.

సి ఇచ్చి పంపించేశారు.ఇదిలా ఉంటే తమ ఇంట్లో తండ్రులు మద్యం సేవించడం చూసి తాము ఈ పని చేసినట్లు విద్యార్థులు కౌన్సిలింగ్ సమయంలో చెప్పటంతో విస్తుపోయారు పాఠశాల సిబ్బంది.

ఇల్లు కట్టేసింది … ఇక పెళ్లెప్పుడు… సోషల్ మీడియాలో పూజ హెగ్డే పెళ్లి వార్త వైరల్..!