రాహుల్ గాంధీ సన్నిహితుడు అలంకార్ సవాయిపై ఈడీ దృష్టి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి అలంకార్ సవాయిపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది.

మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా అలంకార్ సవాయిని ఈడీ ప్రశ్నించింది.టీఎంసీ నాయకుడు సాకేత్ గోఖలే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణపై అలంకార్ సవాయిని మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది.

అయితే తనపై ఆరోపణలను అలంకార్ సవాయి ఖండించారు.గోఖలేకు తాను డబ్బు ఇవ్వలేదని ఈడీ విచారణలో చెప్పారని సమాచారం.

వైరల్ వీడియో: గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..