వయస్సు పెరిగినా కూడా యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ పరిశోధకులు..!
TeluguStop.com
వయసు పెరగడం( Aging ) ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవరాశిలో కచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది.
ముసలితనం అందరికీ శాపంగా, భయంగా అనిపిస్తూ ఉంటుంది.అయితే ముసలితనాన్ని తప్పించుకునే దిశగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.
యవ్వనన్ని పొడిగించేందుకు సాగుతున్న ఈ పరిశోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఒక బృందం ల్యాబ్ లో ఎలుక జీవితాన్ని 47 నెలల వరకు పొడిగించింది.
ఇది ఇదివరకు రికార్డ్ చేసిన ఇతర ఎలుకల ఆయుష్షు కంటే 6 నెలలు ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.
"""/" /
ఇలా ఆయుష్షు( Lifespan )పెంచేందుకు వయసు తక్కువగా ఉన్న ఎలుక నుంచి రక్తంలోని ప్లాస్మా ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఫలితాలను పరిశోధకులు సాధించారు.
వయస్సు పెరిగిన యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు తప్పకుండా ఈ నాలుగు ప్రయోగాల గురించి తెలుసుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే యువకుల నుంచి పెద్దవారికి రక్త మార్పిడి వంటి ప్రయోగాలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ వ్యక్తి జీవితాన్ని పొడిగించడం కోసం కాదు.ఇది యవ్వనాన్ని పొడిగించేందుకు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
జీవితంలోని స్వర్ణ యుగం యవ్వనం( Young Age ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ కాలం మరింత ఎక్కువ కాలం పాటు ఉండేందుకు మరిన్ని ఆనందదాయక సంవత్సరాలను జోడించడానికి మాత్రమే చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాలు వయసు పెరిగిన ఛాయాలకు, వ్యాధులకు కారణమవుతాయి.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే యూఎస్ లోని మిన్నెసోటాలో మయోక్లినిక్ మందులు( Mayo Clinic Medicine ) వాడడం వల్ల ఎలుకల జీవితకాలం పెరిగినట్లు నిరూపించారు.
ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ నిపుణులు వృద్ధాప్యానికి( Old Age ) కారణమయ్యే సెనెసెంట్ కణాలను ఎదుర్కోగల మూడు కాంపౌండ్స్ ను గుర్తించారు.
ఇలా రకరకాల ప్రయోగాలు మనల్ని యవ్వనంగా ఉంచేందుకు కొనసాగుతున్నాయి.ఈ పరిశోధనలలో ఒకటి విజయం సాధించిన అద్భుతమే జరుగుతుంది.